వైభవంగా సీఎం చంద్రబాబు, లోకేష్ దంపతులచే సొంతింటి గృహప్రవేశం
పెద్ద ఎత్తున హాజరైన రాజకీయ నేతలు, కార్యకర్తలు
అభిమానులు, కుప్పం నియోజకవర్గ ప్రజలు
కుప్పంలో.. సీఎం సొంత ఇల్లు
వైభవంగా సీఎం చంద్రబాబు, లోకేష్ దంపతులచే సొంతింటి గృహప్రవేశం
పెద్ద ఎత్తున హాజరైన రాజకీయ నేతలు, కార్యకర్తలు,
అభిమానులు, కుప్పం నియోజకవర్గ ప్రజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం.. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతి.. శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశం వైభవంగా జరిగింది. కుప్పం నియోజక వర్గం నలు మూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు వారి అభిమానాన్ని చాటు కున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి, వీరి తనయుడు మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి లతో కలసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులచే హోమం నిర్వహించి.. శాస్రోత్తంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దంపతులు, నారా లోకేష్ దంపతులునిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభిమానంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను.. పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, కడా పిడి వికాస్ మర్మత్, డి.ఎఫ్.ఓ భరణి,లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు,చిత్తూరు, పూతలపట్టు,నగరి, చంద్రగిరి,తిరుపతి శాసన సభ్యులు ఎన్.అమర నాథ్ రెడ్డి,గురజాల జగన్మోహన్, కే.మురళీ మోహన్,గాలి బాను ప్రకాష్, పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్ పర్సన్ కటారి హేమలత, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ, ఎం ఎల్ ఏ లు దొరబాబు, గౌనివాని శ్రీనివాసులు, సీకే బాబు, నాయకులు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, శ్రీధర్ వర్మ, ప్రజా ప్రతి నిధులు,పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.