ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
వర్చువల్ విధానంలో స్టేషన్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక..
- ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
- వర్చువల్ విధానంలో స్టేషన్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు.
అమృత భారత స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 73 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం 2 వేలు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుందని అన్నారు. 2014 రాష్ట్రంలోని రైల్వే లకు 900 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగితే ఈ ఒక్క ఏడాదిలో 9 వేల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఒక విజన్ తో రైల్వే ను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పెమ్మసాని వివరించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం కూటమి ప్రభుత్వం తో అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.