కడపలో మహానాడు ఏర్పాట్లపై నేతల భేటీ
కనివిని ఎరుగని రీతిలో మహానాడు….
- కడపలో మహానాడు ఏర్పాట్లపై నేతల భేటీ
కడపలో జరగనున్న ఏర్పాట్లపై నేతలు భేటీ అయ్యారు. మహానాడులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతులపై వారు సుదీర్ఘగంగా చర్చించారు.
ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సమన్వయ కమిటీ కోకన్వీనర్ పల్లా శ్రీనివాస్, కమిటీ సభ్యులు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎంఎల్ఏ అమర్నాథ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కడపలోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భేటీ అయిన నేతలు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వసతులు కల్పినపై మాట్లాడారు. మరో నాలుగు రోజులే ఉన్నందున ఏర్పాట్లు వేగంగా చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కనివిని ఎరుగని రీతిలో మహానాడు జరగాలని, ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. భేటీలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.