నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి

ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరణ – ప్రమాణ స్వీకారం చేయించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు – వ్యవసాయ రాయితీ పనిముట్లు రైతులకు చేరువచేస్తానన్న మాలేపాటి

నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి

  • ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరణ
  • ప్రమాణ స్వీకారం చేయించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు
  • వ్యవసాయ రాయితీ పనిముట్లు రైతులకు చేరువచేస్తానన్న మాలేపాటి


ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.


టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వన్నె తెస్తానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టకుంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. గురువారం విజయవాడలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరించారు. అంతరం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెంనాయుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఐఏఎస్ ఎస్. ఢిల్లీరావు, పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ లో ఉన్నామని, మా తండ్రి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో కలిసి పనిచేశారన్నారు. కావలి టీడీపీ ఇంచార్జీగా మూడేళ్లు కస్టపడి పనిచేసినట్లు తెలిపారు. పార్టీని నమ్ముకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అన్యాయం చేయరన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆగ్రో ఇండస్ట్రీస్ ను అస్తవ్యస్తం చేసిందని, ఈ శాఖను ఒకగాడిలో పెట్టీ, రాయితీ వ్యవసాయ పనిముట్లు రైతులకు చేరువ చేస్తానని ఆయన చెప్పా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *