పట్టించుకోవడం లేదు – ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసిన సీహెచ్వోలు
మేడమ్…24 రోజులుగా నిరసన చేస్తున్నా….
- పట్టించుకోవడం లేదు
- ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసిన సీహెచ్వోలు
తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని సీహెచ్వోలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిశారు. మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యేని కలసి వారు వినతి పత్రం అందచేశారు.
నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సీహెచ్ వోలు కలిశారు. 24వ రోజులుగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని నిరసన తెలియజేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందించి… తమ సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు భాను మహేష్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ ఆదిల్, స్వాతి, అనూష సిహెచ్వోలు పాల్గొన్నారు.