కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్

ప్రతీ శనివారం సాయంత్రం 4 గం. నుంచి 6 గం.ల వరకు

మీడియా సమావేశంలో కోవూరు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి

కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్

  • ప్రతీ శనివారం సాయంత్రం 4 గం. నుంచి 6 గం.ల వరకు
  • మీడియా సమావేశంలో కోవూరు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి


కార్యకర్తలకి అన్యాయం జరిగితే వైసీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసం ప్రతీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.


నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అత్తిపల్లిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ లీగల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ…వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎల్లవేళలా కోవూరు వైఎస్ఆర్సిపి కార్యాలయం ప్రతి శనివారం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పేదల ప్రజలపై విద్యుత్ భారం తగ్గిస్తే… ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారం పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి లీగల్ కమిటీ సభ్యులు శ్యామచార్యులు, శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున్ బాబు, బాలకృష్ణ, నరసింహారావు, చంద్రశేఖర్ రాజేష్ కుమార్, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *