సంగంలోని ఇళ్లు, దుకాణాల్లో కరెంటు మీటర్లను తనిఖీ చేసిన అధికారులు
విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు…
- సంగంలోని ఇళ్లు, దుకాణాల్లో కరెంటు మీటర్లను తనిఖీ చేసిన అధికారులు
ఎవరైనా కరెంట్ దొంగలిస్తే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ ఏడీఈ పరుశుధరామయ్య, ఏఈ సుధీర్ లు హెచ్చరించారు. పలు ఇళ్లు, దుకాణాల్లోని కరెంటు మీటర్లను వారు తనిఖీ చేశారు.
నెల్లూరు జిల్లా సంగంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు పలు ఇళ్లు,దుకాణాలలో కరెంట్ మీటర్లను తనిఖీ లు నిర్వహించారు.విజిలెన్స్ ఏడిఈ పరుశుధరామయ్య, ఏ ఈ సుధీర్ లు దుకాణాలు, ఇళ్ళలో అడిషనల్ లోడింగ్,కరెంట్ తెఫ్ట్ ఏమైనా ఉందా అని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.కరెంట్ తెఫ్ట్ జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జూనియర్ లైన్ మెన్ వేణు తదితరులు పాల్గొన్నారు.