నాలుగు లేబర్ కోడ్ల రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం
కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన
జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా…
- నాలుగు లేబర్ కోడ్ల రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం
- కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని జీఎం కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు.
సింగరేణి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలంటూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జిఎం ఆఫీస్ ఎదుట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా ఏకమై సమ్మెను విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు రవికుమార్, తండ్ర విజయ్ కుమార్, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.