యోగాతోనే ఆరోగ్యం..

కలెక్టర్ ఆనంద్ – అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో యోగాసనాలు చేసిన కలెక్టర్

యోగాతోనే ఆరోగ్యం…

  • కలెక్టర్ ఆనంద్
  • అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో యోగాసనాలు చేసిన కలెక్టర్


జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని…ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు. అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని ఆయన కోరారు.


శ్వాసపై ధ్యాసతో యోగాను సాధన చేస్తే ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేని ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగాసాధనలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యోగ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శుల ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే నెలరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో విద్యార్థులు, వాకర్ క్లబ్ సభ్యులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు చేశారు. నయాగ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వకృత్వ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన చిన్నారులకు జిల్లా కలెక్టర్ మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ డి ఓ యతిరాజ్, సెట్నెల్ సీఈవో నాగేశ్వరరావు, కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు విగ్నేష్, విజయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *