జోరుగా కొనసాగుతున్న గుప్త నిధుల వేట

ఇద్దరు పరార్..అధికారుల అదుపులో ఒకరు

జోరుగా కొనసాగుతున్న గుప్త నిధుల వేట…

  • ఇద్దరు పరార్..అధికారుల అదుపులో ఒకరు

గుప్త నిధుల తవ్వకాల ముఠా సభ్యుడుని ఉదయగిరి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ బిఎస్ కుమార్ రాజా మాట్లాడుతూ… రాబడిన సమాచారం మేరకు బండగానిపల్లి మార్గం వైపు ఉన్న రాణి బావి వెయ్యి మెట్ల మార్గం వద్ద ముగ్గురు వ్యక్తులను వెంబడించగా ఇద్దరు పరారయ్యారని ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తి వరికుంటపాడు (మం) తూర్పు బోయమడుగులకు చెందిన నల్లు అశోక్ గా తెలిపారు. ఈ దాడుల్లో FSO చేజర్ల చిన్న వెంకటయ్య , ఉదయగిరి FBO లక్ష్మీ ప్రసన్న, శకునాలపల్లి FBO భాను తేజ, ABO వెంకటేశ్వర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది మైఖేల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *