జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం

అన్ని సౌకర్యాలు ఉచితం

ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నా

కూతురు షరిణితో కలిసి వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను

పరిశీలించిన మంత్రి నారాయణ

జూన్ 12న వీఆర్ హైస్కూల్ ప్రారంభం

  • అన్ని సౌకర్యాలు ఉచితం
  • ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నా
  • కూతురు షరిణితో కలిసి వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

హైస్కూల్ ఆధునీకరణ పనులను కూతురు షరణితో కలసి మంత్రి నారాయణ పరిశీలించారు. జూన్ 12న హైస్కూల్ ని ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని నారాయణ చెప్పారు.


విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని…ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను ఆయన తన కుమార్తె పొంగూరు షరణితో కలసి పరిశీలించారు. హై స్కూల్ లో ఏర్పాట్లు, ఇండోర్ ప్లే ఎక్విప్ మెంట్ తదితర ఏర్పాట్ల షరణి పలుసూచనలిచ్చారు. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా షరణి మాట్లాడుతూ….ఐదేళ్లుగా మూతబడ్డ వీఆర్ హై స్కూల్ పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. దేశంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. జూన్ 12 వ తేదీన స్కూల్ ప్రారంభం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న P4 కింద నేను కూడా కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొంటానని ఈ సందర్భంగా షరణి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ…మంత్రి లోకేష్ ఆమోదంతో 15 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. నిరుపేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ ని డిజైన్ చేసామన్నారు. విద్యార్థులకి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విఆర్సీలో చేరబోయే పేద విద్యార్థుల్లో కొందరిని నాకూతురు షరిణి p4 కింద దత్తత తీసుకోవటం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్, కమిషనర్ వైవో నందన్, కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *