అమరజీవి గాంధేయవాది

మంత్రి నారాయణ

నెల్లూరులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలు

అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, టీడీపీ నేతలు, ఆర్యవైశ్య నాయకులు

ఆకట్టుకున్న పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర AV

అమరజీవి గాంధేయవాది…

  • మంత్రి నారాయణ
  • నెల్లూరులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలు
  • అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, టీడీపీ నేతలు, ఆర్యవైశ్య నాయకులు
  • ఆకట్టుకున్న పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర AV


నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి గాంధేయవాదని ఆయన కొనియాడారు.


అమరజీవి గాంధేయవాదని…తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు కొనియాడారు. నెల్లూరు నగరం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో…శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డీ రాజేష్, ఆర్యవైశ్య మహాసభ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవి 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి నారాయణ విచ్చేశారు. మంత్రికి వారు అపూర్వ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, టీడీపీ నేతలతో కలసి మంత్రి నారాయణ అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ఏవీ అందరిని ఆకట్టుకుంది. సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. అమరజీవి జయంతి ఉత్సవాలు 2025 మార్చి పదహారు నుంచి 2026 మార్చి పదహారు వరకూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయన నెల్లూరు జిల్లావాసి కావటం గర్వకారణమని చెప్పారు. రాజధానిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. 22 ఎకరాల్లో ఇండియాలో నే బెస్ట్ మార్కెట్ ను 9 వ డివిజన్ లో ఏర్పాటు చేస్తున్నామని…ఆ మార్కెట్ కి పొట్టిశ్రీరాములు మార్కెట్ గా నామకరణం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మంత్రి నారాయణకు ఆర్యవైశ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్, కార్పొరేషన్ చైర్మన్ సురేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు, ఆర్యవైశ్యులు, మేధావులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *