పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం, సబ్ కలెక్టర్, అధికారులు, టీడీపీ నేతలు
గూడూరులో హీట్ ద బీట్…
- పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం, సబ్ కలెక్టర్, అధికారులు, టీడీపీ నేతలు
వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు. హీట్ ద బీట్ కార్యక్రమంలో ఆయన సబ్ కలెక్టర్ రాఘవేంద్రతో కలసి పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హీట్ ద బీట్ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తో కలసి పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ…ఎండల తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే తమ పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు అందిస్తూ వాటిని రక్షించాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి, ప్రజలకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందజేసి, సి.వి.సి పార్కులో పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటారు… ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి గీతా కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు…