ఆశ్చర్యానికి గురైన రిటైర్డ్ అధికారులు, ప్రజలు
ఇన్ ఫ్లో రాకుండానే నీటి మట్టం…
- ఆశ్చర్యానికి గురైన రిటైర్డ్ అధికారులు, ప్రజలు
సోమశిల జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో రాకుండా నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో లేకుండా జలాశయంలో నీటిమట్టం పెరగడం ఏంటని రిటైర్డ్ అధికారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రాకుండానే నీటిమట్టం పెరిగినట్లు అధికారులు విడుదల చేసిన డైలీ రీడింగ్ లో ఉండడం విశేషం. శుక్రవారం 47.187 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టాల్సి ఉంది. కానీ శనివారం అధికారులు విడుదల చేసిన నీటి వివరాలల్లో నీటిమట్టం పెరిగి 47.282 టీఎంసీలు నమోదైనట్లు చూపించారు. ఇన్ఫ్లో లేకుండా జలాశయంలో నీటిమట్టం పెరగడం ఏంటని రిటైర్డ్ అధికారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈఈ శ్రీనివాస్ కుమార్ ని వివరణ కోరగా.. ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో రావడం లేదని తెలిపారు. నీటిమట్టంపై పరిశీలిస్తామని తెలియజేశారు.