మజ్జిగ చలివేంద్రం, మొక్కలు నాటిన అధికారులు
గ్రామంలో స్వచ్ఛతా ర్యాలీ, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ
బ్రహ్మదేవంలో బీట్ ద హీట్…
- మజ్జిగ చలివేంద్రం, మొక్కలు నాటిన అధికారులు
- గ్రామంలో స్వచ్ఛతా ర్యాలీ, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ
బ్రహ్మదేవంల బీట్ ద హీట్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన మార్గాలలో స్వచ్ఛతా ర్యాలీ చేపట్టి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో బీట్ ద హీట్ కార్యక్రమం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు మెయిన్ సెంటర్ లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన మార్గాలలో స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, టిడిపి తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్… మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి, ఈవోపీఆర్డీ హేమంత్, పంచాయితీ కార్యదర్శి లెనిన్, టీడీపీ మైనారిటీ నాయకులు అల్లిముత్తు, నాయకులు విష్ణువర్ధన్ రావు, సతీష్ నాయుడు, ధీనయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.