ఏడీ శ్రీనివాసులు హెచ్చరిక
అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవు
- ఏడీ శ్రీనివాసులు హెచ్చరిక
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవని ఏ.డి శ్రీనివాసులు హెచ్చరించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా చేపలు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చేపలను స్వాధీనం చేసుకొని వేలంపాట నిర్వహించారు. చేపలను వేలం నిర్వహించగా రూ.4 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. ఏడి వెంట ఎఫ్. డి. ఓ సురేష్, చందన, తదితరులు ఉన్నారు.