ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద చలివేంద్రం ఏర్పాటు
చలివేంద్రాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప
సంగం సొసైటీను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం…
- ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద చలివేంద్రం ఏర్పాటు
- చలివేంద్రాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప
వేసవి తాపం తగ్గించేందుకు జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ,మంచి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని డీసీవో గురప్ప తెలిపారు. అందులో భాగంగానే సంగం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద సిఈఓ దస్తగిరి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార సంఘం అధికారి గురప్ప పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిసిఒ మాట్లాడుతూ… వేసవి తీవ్రత దృష్ట్యా బీట్ ద హీట్ అనే కార్యక్రమంలో భాగంగా వేసవి తాపం తగ్గించేందుకు జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ,మంచి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంగం సొసైటీను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు లో సంగం సొసైటీ మంచి ప్రగతిని సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్ ,కావలి డివిజన్ సహకార సంఘం అధికారి తిరుపాల్ రెడ్డి, సబ్ డివిజనల్ అధికారి సుభాషిని సిబ్బంది పాల్గొన్నారు.