వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప
కోవూరులో ఉచిత వైద్య శిబిరం
- వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని డీసీవో ప్రారంభించారు. కంటి సమస్యలపై వైద్యులు పలు ఆరోగ్య పరీక్షలు చేశారు.
నెల్లూరు జిల్లా… కోవూరు పట్టణంలో ఉన్న పడుగుపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిఒ గురప్ప ముఖ్యఅతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలపై పలు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డిసిఒ గురప్ప మాట్లాడుతూ… స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సొసైటీ నందు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సామాజిక బాధ్యతను ఈ సొసైటీ వారు విజయవంతంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. జిల్లాలోని పడుగుపాడు సొసైటీ అభివృద్ధిలోనూ సామాజిక బాధ్యతలోను ముందంజలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజనల్ ఆఫీసర్ తిరుపాల్రెడ్డి, ఎస్ డి ఎల్ పి ఓ సుభాషిని, సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…