ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని కలిశారు. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, యువత చేస్తోన్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు.

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.

విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉండి భవిష్యత్తులో ఇంకా మరెంతో ఉన్నత స్థాయిలో ఉండాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషులు, డిప్యూటీ డీఈవో జానకిరామ్, ఎంపీడీవో షాలెట్ ఆకాంక్షించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించి పురస్కారాలు అందచేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలిపారు. ప్రతీ ఒక్కరూ జయంతోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఏవో శివకుమార్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు తాగునీటిని అందించారు.

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.

ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర -1 కిట్లను అధికారులు పరిశీలించారు. తరగతులు ప్రారంభమయ్యే మొదటి రోజే మిత్ర కిట్లను అందించేందుకు అన్నీ చర్యలు చేపట్టామని ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.

సంగంలోని ఎంసెట్ కోచింగ్ సెంటర్ లో సరస్వతీ దేవీ పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..విద్యార్థులను ఆశీర్వదించారు.

మే 6న హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య కేసును వేదాయపాళెం పోలీసులు ఎంతో చాకచక్యంగా చేధించారు. ఫైనాన్షియల్ గొడవలు కారణంగానే చిన్నయ్యని సరస్వతి వెంకటేశ్వర్లు హత్య చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *