ఇదే స్ఫూర్తితో

భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి

సంగంలో పది విద్యార్థులకి అభినందన సభ

ఇదే స్ఫూర్తితో…

  • భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి
  • సంగంలో పది విద్యార్థులకి అభినందన సభ


విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉండి భవిష్యత్తులో ఇంకా మరెంతో ఉన్నత స్థాయిలో ఉండాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషులు, డిప్యూటీ డీఈవో జానకిరామ్, ఎంపీడీవో షాలెట్ ఆకాంక్షించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించి పురస్కారాలు అందచేశారు.


నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్ లో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషులు,డిప్యూటీ డీఈఓ జానకీ రామ్,ఎంపీడీఓ షాలెట్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అదే స్ఫూర్తితో ఉండి భవిష్యత్తులో ఇంకా మరెంతో ఉన్నత స్థాయిలో ఉండాలని అభినందించి..విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ,మండల నాయకులు మోహన్,ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *