ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల, నాయకులు, అధికారులు, ప్రజలు

ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ…

  • ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల, నాయకులు, అధికారులు, ప్రజలు


ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.


పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తోపాటు..టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు, ప్రజలు, మహిళలు అధిక పాల్గొన్నారు. స్థానిక బంగ్లా సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు 100 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి…భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అసువులు బాసిన వీర జవానులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక చెంపపెట్టుగా నిలిచిందని కాకర్ల కొనియాడారు. ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో నియోజకవర్గంలో ఎంతటి గొప్ప కార్యాన్ని నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *