మొదటి రోజే విద్యార్థి మిత్ర కిట్లు

SRVM-1 మండల స్టాక్ పాయింట్ ని పరిశీలన

అధికారులకు, సీఆర్పీ లకు సూచనలు చేసిన ఎపిసి

మొదటి రోజే విద్యార్థి మిత్ర కిట్లు

  • SRVM-1 మండల స్టాక్ పాయింట్ ని పరిశీలన
  • అధికారులకు, సీఆర్పీ లకు సూచనలు చేసిన ఎపిసి


ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర -1 కిట్లను అధికారులు పరిశీలించారు. తరగతులు ప్రారంభమయ్యే మొదటి రోజే మిత్ర కిట్లను అందించేందుకు అన్నీ చర్యలు చేపట్టామని ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.


తరగతులు ప్రారంభం అయ్యే రోజునే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను అందించేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టామని ఎపిసి వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర -1 కిట్లను అధికారులు పరిశీలించారు. AMO సుధీర్ బాబు, CMO పెంచలయ్య మండల విద్యాశాఖ అధికారులతో కలిసి మండల స్టాక్ పాయింట్ ను పరిశీలించిన వెంకటసుబ్బయ్య సీఆర్పీ లకు, పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో పదవ తరగతి సప్లిమెంటరీ విద్యార్థులకు జరుగుతున్న తరగతులు పరిశీలించి… విద్యార్థులకు తగు సలహాలు ఇచ్చారు. అనంతరం వెంకటసుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో లు మధుసూధన, హేమాసుందర రావు, సిబ్బంది సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *