స్పందించకుంటే ఫైటే

నెల్లూరులో కల్చర్ మారింది

హత్యలు, దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్పీని కలిసిన వైసీపీ శ్రేణులు

స్పందించకుంటే…ఫైటే

  • నెల్లూరులో కల్చర్ మారింది
  • హత్యలు, దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • జిల్లా ఎస్పీని కలిసిన వైసీపీ శ్రేణులు


ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని కలిశారు. నెల్లూరులో జరుగుతున్న హత్యలు, యువత చేస్తోన్న అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీని కోరారు.


నెల్లూరులో కల్చర్ మారిపోయిందని, యువత కత్తులు పెట్టుకొని తిరగడం, గంజాయి సేవించి వారు చేస్తోన్న అఘాయిత్యాలపై జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీసీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు… నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ ను కలిశారు. నెల్లూరులో రోజు రోజుకి పెరుగుతున్న కత్తి కల్చర్, దారుణాలు తదితర విషయాలను వారు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారని…త్వరలోనే నెల్లూరులో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాట ఇచ్చారని తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఒక్క నెల్లూరులోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, దారుణాలు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై స్పందించి వాటన్నింటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *