పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, అధికారులు, టీడీపీ నేతలు
వాకాడులో ఘనంగా తిరంగా ర్యాలీ…
- పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, అధికారులు, టీడీపీ నేతలు
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.
పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తోపాటు..టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక అశోక పిల్లల నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలు చేతపట్టి భోలో భారత్ మాతా కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధు రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, బిజెపి ఇన్చార్జి గూడూరు పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, తాసిల్దార్ రామయ్య, టిడిపి మహిళా నాయకురాలు మట్టం శ్రావణి, దువ్వూరు భారతమ్మ, బత్తిన ప్రమీల తదితరులు పాల్గొన్నారు.