కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
పిలుపునిచ్చిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్
జులై 9న దేశ వ్యాప్త సమ్మె…
- కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
- పిలుపునిచ్చిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్
కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జులై 9న దేశ వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలియజేశారు. కార్మిక, ఉద్యోగ సంఘాలతోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జులై 9న సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తెలిపారు. దేశంలో పెట్టుబడిదారుల కోసమే కేంద్రం ఈ కోడ్స్ ను ప్రవేశ పెట్టిందని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సీఐటీయూ కార్యాలయంలో ఆయన సీఐటీయూ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు షాన్వాజ, సిఐటియు కార్యకర్తలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొన్నారు.