సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి..

జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప

పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్

ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి…

  • జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప
  • పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు


పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.


నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు పంచాయతీలో పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప విచ్చేసిన సహకార చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచనల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సొసైటీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. పడుగుపాడు సొసైటీ వరి ధాన్యానికి రైతులకు 48 గంటల్లో సకాలంలో డబ్బులు అందచేశామన్నారు. సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని ఆయన కోరారు…ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, సహాకార శాఖ అధికారులు తిరుపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, యస్ డి యల్ పి ఓ సుభాషిణి, సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి, సూపర్‌వైజర్ బాబు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *