మీ దిక్కున్న చోట చెప్పుకోండి..

స్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించేశాడు

తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ ను వేడుకున్న గిరిజనులు

మీ దిక్కున్న చోట చెప్పుకోండి…

  • స్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించేశాడు
  • తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ ను వేడుకున్న గిరిజనులు


స్మశాన స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మన్నూరు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వారు తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందచేసి నిరసన తెలియజేశారు.


తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పరిధిలోని మన్నూరు గ్రామంలో గిరిజనుల స్మశాన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన జడపల్లి రమణయ్య అనే వ్యక్తి ఆక్రమించాడని గ్రామ గిరిజనులు ఆరోపించారు. ఈ మేరకు వారు తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేసి… కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ… తమ పూర్వీకుల నుండి ఖననం చేసే స్మశాన స్థలాన్ని జడపల్లి రమణయ్య అనే వ్యక్తి ఆక్రమించాడని, ఇదేమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారన్నారు. స్మశాన స్థలాన్ని గతంలో కొంత ఆక్రమించి సాగుచేస్తున్నారన్నారు. మిగిలిన స్థలాన్ని ఆక్రమించి మొక్కలు తొలగించి అమ్ముకున్నారన్నారు. అంతే కాకుండా స్మశానం లోకి వెళ్లనివ్వకుండా సోలార్ పెన్సింగ్ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మశాన స్థలం ఆక్రమణ తొలగించి…కబ్జాదారుల నుండి స్మశాన స్థలాన్ని విడిపించాలని గిరిజనులు అధికారులను వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *