ప్రసన్న గంగమ్మ తల్లిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు దంపతులు
మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
21న కుప్పంకి సీఎం చంద్రబాబు…
- ప్రసన్న గంగమ్మ తల్లిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు దంపతులు
- మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
ఈనెల 21న కుప్పంలోని గంగమ్మ తల్లి అమ్మవారిని సీఎం చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకోనున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబులు తెలిపారు. ఈ మేరకు వారు ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మే 21న కుప్పం నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేస్తున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబులు తెలిపారు. సీఎం చంద్రబాబు దంపతులు తిరుపతి గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొని…అమ్మవారిని దర్శించుకోనున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక స్వామి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.