మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆనం
గ్రీవెన్స్ లో మంత్రి ఆనం…
- మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆనం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను మంత్రి స్వయంగా స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై అక్కడికక్కడే మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. గ్రీవెన్స్ లో మంత్రితోపాటు…ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.