ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
పడుగుపాడులో మినీ ఆటో నగర్ కి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
నిన్న రాత్రి వచ్చింది
మినీ ఆటోనగర్ దినదినాభివృద్ధి చెందాలి…
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- పడుగుపాడులో మినీ ఆటో నగర్ కి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
మినీ ఆటో నగర్ దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. పడుగుపాడులో సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ ఆటో నగర్ కి ఆమె భూమి పూజ చేశారు.
నెల్లూరు జిల్లా… కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవే లోని భారత్ బెంజ్ వెనుక వైపు ఇనమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఆటోనగర్ కి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. మొక్క నాటారు అనంతరం భూమి పూజ కార్యక్రమం చేసి వీధిలైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆటో నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు..కార్యక్రమంలో కోవూరు పడుగుపాడు కూటమి నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పడుగుపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు…