కోవూరుకు కొత్త నీరు

మండ‌లాధ్యక్షుల‌ను ప్రక‌టించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యం

పాత‌,కొత్త వారిని స‌మ‌న్వయం చేసుకుని.. క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం

కోవూరుకు కొత్త నీరు..!

  • మండ‌లాధ్యక్షుల‌ను ప్రక‌టించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
  • నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యం
  • పాత‌,కొత్త వారిని స‌మ‌న్వయం చేసుకుని.. క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం


కోవూరు నియోకవర్గంలో టీడీపీ మండలాధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. పాత, కొత్త వారిని సమన్వయం చేసుకొని కలసికట్టుగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.


నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుల ప్రోత్సాహంతో.. నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి త‌న‌ నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల‌కు నూత‌న అధ్యక్షుల‌ను ప్రక‌టించారు. కోవూరు మండ‌లం కొల్లారెడ్డి సుధాక‌ర్‌రెడ్డి, బుచ్చి అర్భన్ గుత్తా శ్రీ‌నివాసులు, బుచ్చి రూర‌ల్‌మండ‌ల గౌర‌వాధ్యక్షుడిగా టంగుటూరి మ‌ల్లారెడ్డి, ఇందుకూరుపేట మండ‌లం యేకొల్లు ప‌వ‌న్‌రెడ్డి, కొడ‌వ‌లూరు మండ‌లం నాపా వెంక‌టేశ్వర్లునాయుడు, విడ‌వ‌లూరు మండ‌లం యేటూరు శ్రీ‌హ‌రి రెడ్డిల‌ను ఎన్నుకున్నారు. ఈసంద‌ర్భంగా వారంద‌రికీ ప్రశాంతిరెడ్డి శుభాకాంక్షులు తెలిపారు. పార్టీ మండ‌లాధ్యక్షులుగా ఎన్నికైన‌వారు త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేయాల‌ని, కార్యక‌ర్తలు, నాయ‌కుల‌ను క‌లుపుకొని ప్రజా సంక్షేమ‌మే లక్ష్యంగా ముందుకు సాగాల‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోరారు. అలాగే.. ప్రభుత్వం చేస్తున్న మంచి ప‌నులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాల‌న్నారు. పాత‌, కొత్త నాయ‌కులంద‌రూ స‌మ‌న్వయంతో .. క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేసి, ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాల‌ని ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *