అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌

టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌

విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌

అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌
టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌

విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌

2024-25 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి CBSE పదవ తరగతి ఫలితాల్లో నెల్లూరులోని త‌మ‌ అవెన్యూ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో మా విద్యార్థుల అద్భుత విజయాలు సాధించార‌ని,, వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం మా పాఠశాల ఘనతగా నిలిచిందని ఆ పాఠ‌శాల క‌రస్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ చైత‌న్య తెలిపారు. ఈమేర‌కు నెల్లూరు కేవీఆర్ పెట్రోలు బంకు.. స‌మీపంలోని బ్రహ్మానంద‌పురంలోని అవెన్యూ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్‌లో విద్యార్థులకు అభినంద‌న కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశారు. ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన వారిని కృష్ణ‌చైత‌న్య‌, ఉపాధ్యాయులు, సిబ్బంది స‌త్క‌రించి.. అభినందించారు. ఈ ఫలితాల్లో లక్ష్మీ విజ్వల్ 485 మార్కులతో స్కూల్ టాపర్‌గా, పెంచల సాయి పవన్ 480 మార్కులతో రెండవ స్థానంలో.. సయ్యద్ రిహాన్ 476 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు విద్యార్థుల ఘనత పాఠశాల ఖ్యాతిని మరింత మెరుగుపరిచింద‌ని వారు కొనియాడారు. అనంత‌రం మీడియాతో కృష్ణ‌చైత‌న్య మాట్లాడారు. ఇది.. టీమ్ వ‌ర్క్ కు అద్భుత ఉదాహ‌ర‌ణ అన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయులు నిబద్ధ‌త‌, త‌ల్లిదండ్రుల స‌హ‌కారానికి మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. మంచి విద్య‌ను అందిస్తూ.. భ‌విష్య‌త్తులో అత్యుత్త‌మ ఫితాలు సాధించేలా బోధ‌న ఉంటుంద‌న్నారు. అనంత‌రం ప్ర‌ధానోపాధ్యాయురాలు శ్వేత సంధ్యా, వైస్ ప్రిన్సిప‌ల్ సురేష్‌లు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *