ఆర్ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావ్
నారద మహర్షి జయంతి సందర్బంగా సాహితి సుధా పౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మానం
బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం
నిజాలను నిర్బయంగా రాసేవాళ్లే జర్నలిస్టులు
- ఆర్ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావ్
-నారద మహర్షి జయంతి సందర్బంగా
సాహితి సుధా పౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మానం
బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. ప్రజా సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమని ఆర్ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావ్ అన్నారు. నారద మహర్షి జయంతి సందర్బంగా నెల్లూరు ఏసీ నగర్లోని వివేకానంద స్కూల్లో సాహితి సుధా పౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాణాలకు తెగించి వార్తలను కవర్ చేస్తూ.. ప్రజలకు నిస్వార్ద చేసే వారే జర్నలిస్టులని ఆయన కొనియాడారు. అనంతరం అవార్డు గ్రహీతలైన బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర నాయుడు, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్, సాక్షి సింగ్, వార్తా శ్రీను లను శాలువాతో సత్కరించి.. మెమెంటో లు అందజేశారు. అనంతరం బిగ్ టీవీ స్టాపర్ సురేంద్ర మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి.. వాటిని వెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతృఫ్తి నిస్తుందన్నారు. తనను సన్మానించిన సాహితీ సుధా పౌండేషన్ వారికి కృతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.