నెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స
కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు
నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు.
మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్
ఐదేళ్ల చిన్నారికి పునర్జన్మనిచ్చిన అపోలో
నెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స
కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు
నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు.
మీడియా సమావేశంలో వివరాలు తెలియజేసిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్
నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 ఏళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన అదునాతన పద్దతుల్లో శస్త్ర చికిత్స నిర్వహించి.. ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. నెల్లూరులో ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే ప్రధమం అని వైద్యులు పేర్కొన్నారు. ఈసందర్భంగా బుధవారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్, హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించి ఆయా వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన 5 ఏళ్ల చిన్నారికి రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలయ్యాయి. నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ కి ఆ పాప కుటుంబసభ్యులు తీసుకొచ్చారన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఐసియూలో ఉంచి మరుసటి రోజు సీటి స్కాన్ ద్వారా పరీక్షించగా కుడివైపు మెదడులోని ముఖ్య భాగంలో రక్తం గడ్డ కడుతూ ఉండటాన్ని గుర్తించామన్నారు. తక్షణం శస్త్ర చికిత్స నిర్వహించాలని వారి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారి అంగీకారంతో అదునాతన పద్దతుల్లో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సా విధానాన్ని వారు వివరించారు. ఈ సమావేశంలో బాలికతో పాటూ న్యూరో విభాగం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.