మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడు

ఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

అంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం

మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడు
ఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు
అంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం

నెల్లూరు జిల్లా.. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు మండలం నల్లగొండ్ల లో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండగుగా సాగింది. స్వామి వారి కళ్యాణానికి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వేలాదిగా తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు.ఆలయానికి వచ్చే భక్తులకు కార్యనిర్వాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత కన్నుల విందుగా భక్తులకు ఆ దేవా దేవుళ్లు దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను తిలకించడానికి వేలాదిగా తరలివచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *