క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపు

సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి

క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపు
సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి,

స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి

పార్టీలో క‌ష్ట‌ప‌డి పనిచేసేవారికి ఎప్ప‌టికీ గుర్తింపు ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీ మ‌రోసారి నిరూపించింది. ఎప్పుడు తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. నెల్లూరు జిల్లాకు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తుంది. పార్టీకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారిని గుర్తించి మ‌రీ రాష్ట్ర ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతుంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల విడుద‌ల చేసిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ ప‌ద‌వుల్లో నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత డాక్ట‌ర్ జ‌డ్‌. శివ‌ప్ర‌సాద్‌కు ఏపీ ల్యాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మ‌న్‌గా, కావ‌లికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడుకు ఏపీ ఆగ్రోస్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ఛైర్మ‌న్‌గా అవ‌కాశం క‌ల్పించింది. దాంతో వారిద్ద‌రూ డీడీపీ సినియ‌ర్‌నేత గూటూరు క‌న్న‌బాబుతో క‌ల‌సి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌సి.. పుష్ప‌గుచ్ఛాలు, శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈసంద‌ర్భంగా వాళ్లంతా జ‌డ్‌. శివ‌ప్ర‌సాద్‌కు, మాలేపాటికి శుభాకాంక్షులు తెలిపారు. పార్టీకి, ప‌ద‌వుల‌కు వ‌న్నె తీసుకోవాల‌ని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *