ఘన విజయం సాధించిన ఓవెల్ 18 విద్యార్థులు.
సి.బి.యస్.ఇ -10వ తరగతి ఫలితాలలో
ఘన విజయం సాధించిన ఓవెల్ 18 విద్యార్థులు.
అఖిలభారత జాతీయ స్థాయిలో జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓవెల్-18 విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆర్. వేణు, సీఈవో ఆర్. ప్రమీళ ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించారు. వారికి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వేణు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. పాఠశాల స్తాయి ఫలితాల్లో, పోలిశెట్టి హిమశ్రీ 474 మార్కులతో ప్రధమ స్థానం, ఎస్ కె. నేహ భాను 460 మార్కులతో ద్వితీయ స్థానం, మామిడి కార్తీక్ 448 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని ఈసందర్భంగా తెలిపారు. అలాగే.. 45 మంది విద్యార్ధులు పరిక్షలకు హాజరుకాగా అందులో 42 మంది ప్రధమ శ్రేణిలో, ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విధ్యార్థులు.. తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యం విధ్యార్ధులు, అధ్యాపక బృందానికి ఈ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. పాఠశాల జి.ఎమ్. మహదేవన్, ఇ.డి. వి. బాలు, డి.జి.ఎమ్. శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.