ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు

నాయుడుపేట మున్సిపాలిటీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌

అక్ర‌మ క‌ట్టడాలు, నిర్మాణాల‌ను తొల‌గించిన అధికారులు

తీవ్ర ఉద్రిక్త‌త‌.. బైఠాయించి ఆందోళ‌న‌కు దిగిన మ‌హిళ‌లు

పోలీసుల జోక్యంతో కొంత‌సేపు ఆందోళ‌న‌

కొంద‌ర్ని బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లింపు

ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు..!

  • నాయుడుపేట మున్సిపాలిటీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌
    అక్ర‌మ క‌ట్టడాలు, నిర్మాణాల‌ను తొల‌గించిన అధికారులు
    తీవ్ర ఉద్రిక్త‌త‌.. బైఠాయించి ఆందోళ‌న‌కు దిగిన మ‌హిళ‌లు
    పోలీసుల జోక్యంతో కొంత‌సేపు ఆందోళ‌న‌
    కొంద‌ర్ని బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లింపు

తిరుప‌తి జిల్లా.. నాయుడుపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని పొగ‌టం కాల‌నీ రోడ్డుప‌క్క‌నున్న విలువైన మున్సిపాలిటీ స్థ‌లం కొన్నేళ్లుగా ఆక్ర‌మ‌ణ‌కు గురై ఉంది. దీనిపై రెండేళ్ల‌క్రిత‌మే మున్సిపాలిటీ కోర్టుకెళ్లింది. కొంత మంది కొత్త‌గా.. కోర్టు ఆదేశాలు ప‌ట్టించుకోకుండా..మ‌ళ్లీ అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్టి.. పెద్ద‌పెద్ద నిర్మాణాలు చేప‌డుతుండ‌టంతో.. మున్సిపాలిటీ క‌మిష‌న‌ర్ రంగంలోకి దిగారు. అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను జేసీబీ సాయంతో తొల‌గిస్తుండ‌గా.. కొంద‌రు మ‌హిళ‌లు అడ్డుప‌డ్డారు. క‌ట్ట‌డాల‌ను తొల‌గించ‌డానికి వీల్లేదంటూ ఆందోళ‌న‌కు దిగారు. మండుటెండ‌ను సైతం లెక్క చేయ‌కుండా మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందిని ఇబ్బందిపెట్ట‌డంతో.. ఇక పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. సీఐ బాబి, ఎస్సై స్వ‌ప్న‌, సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని వారికి స‌ద్ధి చెప్పే య‌త్నం చేశారు. అయినా.. వారు విన‌కుండా.. పోలీసులతోనూ దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దాంతో పోలీసులు వారందర్నీ బ‌ల‌వంతంగా.. జీపు ఎక్కించి.. స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కొద్దిసేపు అక్క‌డ ఉద్రిక్త‌త వాతావర‌ణం నెల‌కొంది. ఈసంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ ఫ‌జులుల్లా మీడియాతో మాట్లాడారు. నాయుడుపేట మున్సిపాలిటీ ప‌రిధిలో.. ఆ విలువైన స్థ‌లంపై వెంక‌ట‌గిరి రాజా వార‌సులకి.. మ‌రి కొంద‌రు వ్య‌క్తుల మ‌ధ‌ధ్య కోర్టులో విచార‌ణ జ‌రుగుందంద‌న్నారు. కొంత మంది కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. నూత‌నంగా నిర్మిస్తున్న క‌ట్ట‌డాల‌ను పోలీసుల సాయంతో తొల‌గించ‌డం జ‌రిగింద‌ని ఈసంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *