ఇద్దరికి తీవ్ర గాయాలు
కోవూరులో ఘటన
లారీ కంటైనర్ ను ఢీకొట్టిన బైక్….
- ఇద్దరికి తీవ్ర గాయాలు
- కోవూరులో ఘటన
నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి వైపు నుండి నెల్లూరు వైపుకు వెళ్తున్న మార్గంలో సాయిబాబా గుడి వద్ద నేషనల్ హైవే బిడ్జిపై ఆగి ఉన్న లారీ కంటైనర్ను మోటారు బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడవలూరు మండలం నాయుడుపాలెంకు చెందిన బైక్ పై వస్తున్న మదన్, కిషోర్ లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది, కోవూరు పోలీసులు గాయాలైన ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవే ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…