అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి

29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో 1. 22 కోట్ల అభివృద్ధి

మీడియా సమావేశంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య

అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి

  • 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో 1. 22 కోట్ల అభివృద్ధి
  • మీడియా సమావేశంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య


అభివృద్ధికి మారుపేరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అని 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. కోటంరెడ్డి సోదరుల సహాయ సహకారాలతోనే మహాత్మాగాంధీ నగర్లో 1.22 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు.


నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 11 నెలలుగా 1.22 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకట్ రెడ్డి నగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ వెంకట్ రెడ్డి నగర్, వీవర్స్ కాలనీ, వి ఎం ఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి తమ సహాయ సహకారాలు అందించి నిధులు మంజూరు చేశారు. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారన్నారు. టిడిపి క్లస్టర్ ఇంచార్జి కనపర్తి గంగాధర్, తిప్పిరెడ్డి మమతారెడ్డి, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అస్లాం, జిలానీ మాట్లాడుతూ… మహాత్మా గాంధీ నగర్ లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసుకున్నాయని ఈ నెల 15వ తేదీన వీటిని ప్రారంభిస్తున్నామన్నారు. అభివృద్ధికి మారుపేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో గీతా క్రిష్ణ , నవీన్ రెడ్డి, దస్తగిరి, మౌలాలి, నరేంద్ర రెడ్డి, కృష్ణ, ఖాదర్, వాజిద్, జావిద్, రజిని, నారాయణ, జయరాం, రాజా, సూరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *