కోట్లలో అవినీతి జరిగినా చర్యలేవి

సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినా స్పందన లేదు

కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన రఘు

కోట్లలో అవినీతి జరిగినా చర్యలేవి…

  • సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినా స్పందన లేదు
  • కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన రఘు


ఉపాధి పనుల్లో 5 కోట్లు రూపాయలు అవినీతి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందచేశారు. అవినీతి చేసిన అధికారులపై పూర్తి స్థాయి విచారణ చేయాలని పాధి హామీ పనుల నిజనిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు కలెక్టర్ ను కోరారు.


నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని తనిఖీల్లో తెలిసినా అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఉపాధి హామీ పనుల నిజనిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు ప్రశ్నించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇదే అంశంపై ఆయన కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా రఘు ఎన్ 3 న్యూస్ తో మాట్లాడుతూ… జిల్లాలో 14 మండలాలకు సంబంధించి సోషల్ ఆడిట్లో రూ. 5 కోట్ల మేర ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని, రికవరీకి సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న అధికారుల అవినీతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *