ఎమ్మార్వో ముందే వీఆర్వోలకి లంచం ఇచ్చిన ఎమ్మెల్యే
ఖంగ్గుతిన్న అధికారులు, సిబ్బంది
గూడూరులో సంచలనం…
- ఎమ్మార్వో ముందే వీఆర్వోలకి లంచం ఇచ్చిన ఎమ్మెల్యే
- ఖంగ్గుతిన్న అధికారులు, సిబ్బంది
వీఆర్వోలకి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ లంచం ఇచ్చారు. ఈ సంఘటన గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో సంచలనంగా మారింది. ఇలాంటివి రిపీట్ అయితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది…..సమస్యలపై కార్యాలయానికి వచ్చిన తమను విఆర్వోలు లంచం డిమాండ్ చేశారని కొందరు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు… దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా బాధితులను వెంటబెట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం కు చేరుకున్నారు…గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ , ఇందిరానగర్ లో వీఆర్వోలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దకి స్వయంగా ఎమ్మెల్యే నగదును ఇచ్చాడు…బాధితుల వద్ద కాకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవాలని వారికి సూచించారు…కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేయడం దారుణమని అన్నారు…అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు… సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు… ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు…