నాడు పైలాన్ ను ధ్వంసం చేసింది మాజీ ఎమ్మెల్యేనే..!
కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే పైలాన్ ధ్వంసం
విలేకరులను పావులుగా వాడుకుని వారిని బలి పశువులను చేశాడు.
కావలి అమృత్ పైలాన్ ధ్వంసం కేసుపై సుకుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు
నమ్ముకున్నవారిని..
నట్టేట ముంచడం ప్రతాప్రెడ్డి నైజం..!
నాడు పైలాన్ ను ధ్వంసం చేసింది మాజీ ఎమ్మెల్యేనే..!
కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే పైలాన్ ధ్వంసం
విలేకరులను పావులుగా వాడుకుని వారిని బలి పశువులను చేశాడు.
కావలి అమృత్ పైలాన్ ధ్వంసం కేసుపై సుకుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు
కావలి పైలాన్ ధ్వసం..మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, తనతోపాటు విలేకరులపై కేసుల నమోదు.. ఇతర అంశాలపై మొదటిసారి మన్నెమాల సుకుమార్రెడ్డి నోరువిప్పారు. కావలి పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. ఆ నాడు జరిగిన వ్యవహారంపై వాస్తవాలను తెలియజేసి.. సంచలనాలకు తెరలేపారు. కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే కావలిలో అమృత్ పథకం పైలాన్ ను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశాడని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. పైలాన్ ఉన్న స్థలంలో విలేకరులకు ప్రెస్ క్లబ్ కట్టిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాయమాటలు చెప్పి.. రాత్రికి రాత్రే ధ్వంసం చేయించారన్నారు. నాడు ఈ చర్యను తాను వ్యతిరేకించినట్లు చెప్పారు. కానీ నాయకుడిగా తాము.. ఆయన అనుచరులుగా ధ్వంసం చేసే ప్రక్రియలో తాము పాలుపంచుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, తాను, పలువురు వైసిపి నేతలు, విలేకరులు ముద్దాయలుగా చేస్తే, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమే బెయిల్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. నమ్ముకున్న వారిని వాడుకుని, వారిని నట్టేట ముంచడం ప్రతాప్ కుమార్ రెడ్డి నైజం అంటూ ఈసందర్భంగా సుకుమార్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో సుకుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసుపై స్వయంగా సుకుమార్రెడ్డే.. స్పందించడం.. ప్రతాప్రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం.. ఇప్పుడు కావలిలో చర్చనీయాంశంగా మారింది. కావలి రాజకీయ, మీడియా వర్గాల్లో ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.