నరసింహుని సేవలో ఎంపీ వేమిరెడ్డి…  ​

పెంచలకోన బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే కురుగొండ్లతో కలిసి పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నరసింహుని సేవలో ఎంపీ వేమిరెడ్డి….

  • పెంచలకోన బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే కురుగొండ్లతో కలిసి పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి


పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి నరసింహస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొని… స్వామి అమ్మవార్లను, ఆంజనేయస్వామినీ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాన్ని అందచేశారు.వారు స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ వెంట డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఈవో పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *