అనుమతి లేకుండా గ్రావెల్ దందా చేస్తే..

అక్రమార్కులను ప్రోత్సహించను, అవినీతి రహిత కోవూరు సాధనే నా లక్ష్యం

పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనుమతి లేకుండా గ్రావెల్ దందా చేస్తే…

  • అక్రమార్కులను ప్రోత్సహించను, అవినీతి రహిత కోవూరు సాధనే నా లక్ష్యం
  • పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి


ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు.


అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే సహించేది లేదని… ఇసుక, గ్రావెల్ ఏవైనా సరే అధికారుల అనుమతితో పగలు మాత్రమే తోలుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పున్నూరు గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు. పున్నూరు గ్రామంలో నిరుపయోగంగా వున్న దొరువును స్థానిక అవసరాల కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసి గ్రామ పంచాయతికి స్వాధీనం చేశారు. యుద్ధంలో వీర మరణం పొందిన మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తొలి విడత టెంకాయ మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా వున్నారన్నారు. విభేదాలను పక్కన పెట్టి గ్రామాభివృద్ధికి పాటు పడవలసిందిగా ఆమె స్థానిక నాయకులకు హితోపదేశం చేశారు. యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రెటరీ పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు, ఉపాధ్యక్షుడు కూకటి వెంకటేశ్వర రెడ్డి, సింధుర్ కృష్ణ, తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *