నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుంది

వీర జవాన్‌ మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పించిన వేమిరెడ్డి దంపతులు

నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుంది

  • వీర జవాన్‌ మురళి నాయక్ కు ఘన నివాళులు అర్పించిన వేమిరెడ్డి దంపతులు


వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి వేమిరెడ్డి దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని వారు అన్నారు.


మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నగరంలోని విపిఆర్‌ నివాసరంలో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి వారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు కొద్దిసేపు మౌనం పాటించారు. జోహార్‌ మురళీ నాయక్‌, అమర్‌రహే మురళీ నాయక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, ముంగర గోపాల్‌, యాకసిరి వెంటకరమణమ్మ, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *