ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

100 మంది మహిళలకు చీరలు పంపిణీ, మాతృమూర్తులకు సత్కారం

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ

ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

  • 100 మంది మహిళలకు చీరలు పంపిణీ, మాతృమూర్తులకు సత్కారం
  • ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ


సూళ్లూరుపేటలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని వంద మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.


తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నేముత్తేరి గ్రామంలో సాయి సేవా వృద్ధాశ్రమం వ్యవస్థాపకుడు పట్నం మస్తాన్ బాబు ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఆమెకి వృద్ధాశ్రమం స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా 100మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అలాగే మాతృమూర్తులను సన్మానించి సత్కరించి మేమంటోను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదన్నారు. తన కడుపు మార్చుకొని బిడ్డకు పెట్టేది తల్లిని ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిదే తల్లి రుణమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *