కుట్రదారులకు ప్రజలే గుణపాఠం

మా బాబాయి గిరిధర్ రెడ్డిని దీవించండి

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి

339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా

19వ డివిజన్ లో ట్రయిల్ రన్

కుట్రదారులకు ప్రజలే గుణపాఠం…

  • మా బాబాయి గిరిధర్ రెడ్డిని దీవించండి
  • రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి
  • 339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్ లో ట్రయిల్ రన్


339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్ లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి వైష్ణవి ట్రయిల్ రన్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 19 డివిజన్ లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు.


2029 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మా బాబాయి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారని రూరల్ ప్రజలు తమ దీవెనలు అందించి ఘన విజయం అందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటం రెడ్డి సాయి వైష్ణవి కోరారు. ఈనెల 15న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా 19వ డివిజన్ లో ట్రయిల్ రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 19 డివిజన్ లో 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో నాన్నను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేశారన్నారు. ప్రజలు మాత్రం కోటంరెడ్డిని దీవించి 35వేల భారీ మెజార్టీని అందించారన్నారు. కుట్ర దారులకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పారన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, తమకు భారీ విజయం అందించిన ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత దార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *