జేసీ కార్తీక్ – డేవిస్పేట గ్రామంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి అభినందన సభ
విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి
- జేసీ కార్తీక్
- డేవిస్పేట గ్రామంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి అభినందన సభ
యాంకర్ పార్ట్ :
విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆకాంక్షించారు. డేవిస్పేటలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్ని ఆయన అభినందించారు.
వాయిస్ వోవర్ :
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామం పాకవారిపాలెంలో నిర్మలాదేవి ఫౌండేషన్, భీమ్ భారత్ సైనిక సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి ఉత్తమ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు అభినంద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ డాక్టర్.రామాయణం మహేష్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ మాట్లాడుతూ… విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. నిరంతర నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంఈఓ సునీల్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో, భీమ్ భారత్ సైనికులు, మండల ఉపాధ్యాయులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు..