నెరవేరబోతున్న దశాబ్ధాల కల

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

నెరవేరబోతున్న దశాబ్ధాల కల…

  • రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష


కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షించారు. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు.


కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో ఆయన, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రైల్వే అండర్ బ్రిడ్జీలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. జూన్ నెలాఖరులోపు రైల్వే అండర్ బ్రిడ్జీలకు టెండర్లు పూర్తికి రైల్వే అధికారుల హామీ ఇచ్చారన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎట్టి పరిస్థితుల్లో అండర్ బ్రిడ్జీలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *